హైదరాబాద్ : ఎలక్ట్రిక్ స్కూటర్ మాన్యుఫాక్చరర్ ఎథర్ ఎనర్జీ ఇండియా 2020 ఆర్థిక సంవత్సరంలో సాధించిన విజయాలను వివరిస్తూ ఇంపాక్ట్ రిపోర్ట్ను ఇటీవల విడుదల చేసింది. తమ వెహికల్స్ వల్ల పర్యావరణానికి, సమాజానికి, ఎకానమీకి ఎంతో మేలు జరిగిందని ప్రకటించింది. ఈ రిపోర్టులోని వివరాల ప్రకారం, ఎథర్ స్కూటర్ల వల్ల కస్టమర్లు రూ. 2 కోట్ల విలువైన పెట్రోల్ ఆదా చేశారు. ఆత్మ నిర్భర్ భారత్కు అనుగుణంగా స్పేర్పార్ట్లన్నింటినీ లోకల్గానే సేకరిస్తున్నారు. ప్లాంట్లలో అత్యధిక సంఖ్యలో మహిళలను నియమించుకున్నారు. ‘4పి’ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించి క్వాలిటీ ఇంపాక్ట్ గోల్డ్ లీఫ్ అక్రిడిటేషన్ లభించింది. ఈ కంపెనీ స్కూటర్ల ద్వారా కస్టమర్లు ఇప్పటివరకు నాలుగు కోట్ల కిలోమీటర్లు ప్రయాణించగా, 30 మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను అడ్డుకోవడం సాధ్యపడిరది.