హైదరాబాద్ : ఫోర్డ్ ఇండియా తాజాగా తన అగ్రగామి హ్యాచ్బ్యాక్ ఫిగోలో ఆటోమేటిక్ వేరియెంట్లను పరిచయం చేసింది. టైటానియం, టైటానియం ప్లస్ ట్రిమ్స్లో ప్రారంభ ధరలు వరుసగా రూ. 7.75 లక్షలు, రూ.8.20 లక్షలు ఉన్నాయి. కొత్త ఫిగో ఎటి ఈ శ్రేణిలో అత్యుత్తమ సిక్స్-స్పీడ్, టార్క్ కన్వర్టర్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ భారత్ స్టేజ్ 6 త్రీ-సిలిండర్ 1.2 లీ పెట్రోల్ ఇంజిన్తో అందుబాటులోకి వచ్చింది.