Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

మహమ్మద్‌ సిరాజ్‌తో థమ్స్‌ అప్‌ భాగస్వామ్యం

హైదరాబాద్‌ : టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్‌ గేమ్స్‌ 2020లో పలత్‌దే, తానేపలత్‌దే పేర్లతో నిర్వహించిన ప్రచారాలతో ‘తూఫానీ’ స్ఫూర్తిని సెలబ్రేట్‌ చేసుకున్న తర్వాత, కోకా-కోలా ఇండియా స్వదేశీ బ్రాండ్‌ థమ్స్‌ అప్‌, దాని పలత్‌దే ప్రచారం ద్వారా భారత ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ ధైర్యం, సంకల్పాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నది. ఈ మేరకు సిరాజ్‌తో థమ్స్‌ అప్‌ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. ఇది ప్రత్యేకమైన మద్యపానరహిత పానీయ భాగస్వామిగా ఐసిసి (ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌)తో థమ్స్‌ అప్‌ భాగస్వామ్యానికి కొనసాగింపు. ఈ అసోసియేషన్‌ ద్వారా, థమ్స్‌ అప్‌ క్రీడల పట్ల తన దీర్ఘకాల నిబద్ధతను ప్రదర్శిస్తుందని కోకాకోలా ఇండియా, సౌత్‌-వెస్ట్‌ ఏషియా వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌-మార్కెటింగ్‌ అర్నబ్‌ రాయ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img