నాలుగు నెలల్లో 510 కోట్ల ఆదాయం
తిరుమల శ్రీవారి హుండీ కానుకలు భారీగా పెరుగుతున్నాయి.. గడచిన నాలుగు నెలల్లో శ్రీవారి హుండీ ద్వారా 509 కోట్ల పై చిలుకు రాబడి శ్రీవారి ఖజానాకు లభించింది. కొవిడ్ పరిస్థితుల అనంతరం ఏప్రిల్ నుంచి సర్వదర్శనం భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తుండడంతో తిరుమల శ్రీవారి హుండీ కానుకలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో రూ.128 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ.127.5 కోట్లు, మే మాసంలో రూ.130.5 కోట్లు, జూన్ మాసంలో రూ. 123. 76 కోట్లు హుండీ కానుకలు లభించాయి. ఇలా మొత్తంగా నాలుగు మాసాల్లో రూ.509.76 కోట్ల హుండీ కానుకలు శ్రీవారి ఖజానా అందాయి.. గత సోమవారం ఒక్కరోజే రూ.6.18 కోట్లు వచ్చాయి. టీటీడీ చరిత్రలో రూ.6 కోట్లకు పైగా రావడం ఇది రెండోసారి. స్వామివారికి సోమవారం ఓ అజ్ఞాత భక్తుడు రూ.1.64 కోట్లు సమర్పించారు.. ఇదిలా వుండగా ఇప్పటిదాకా 2012 ఏప్రిల్ 1న తిరుమల వెంకన్న హుండీకి ఒకరోజు అత్యధికంగా లభించిన ఆదాయం రూ.5.73 కోట్లు. ఇప్పుడు మొట్టమొదటిసారి రూ.6 కోట్ల మార్క్ను దాటింది.. ఇప్పుడు 2012 రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది.