హైదరాబాద్ : సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ విడుదల ఖాయమని చిత్ర యూనిట్ తెలిపింది. విడుదల తేదీలో ఎటువంటి మార్పు ఉండదని వెల్లడిరచింది.2022 సంక్రాంతి లక్ష్యంగా ఇప్పటికే మరో రెండు సినిమాలు విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. పవన్కల్యాణ్-రానా కథానాయకులుగా నటించిన ‘భీమ్లానాయక్’ మహేష్ ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఈ సీజన్ బరిలో దిగనుందని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ‘రాధేశ్యామ్’ విడుదలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ అనుమానాలకు తెరదించుతూ తమ చిత్రం ముందుగా అనుకున్న తేదీకే వస్తుందని ‘రాధేశ్యామ్’ చిత్రబృందం స్పష్టం చేసింది. కరోనాకు ముందు సాధారణ పరిస్థితుల్లో కూడా అగ్ర హీరోల సినిమాలు ఇలా ఒకేసారి విడుదల కాలేదు. వీటిలో ఏదో ఒకటి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 1970ల నాటి ప్రేమకథతో ‘రాధేశ్యామ్’ను తెరకెక్కించారు. విక్రమ్గా ప్రభాస్, ప్రేరణగా పూజాహెగ్డే నటించారు. ఈ సినిమాలో కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. దక్షిణాదికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.