హైదరాబాద్ : గౌరీ రోణంకి దర్శకత్వంలో రోషన్ హీరో, శ్రీలీల జంటగా నటించిన ‘పెళ్లి సందడి’ సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. హీరో రవితేజ ఈ పాటను విడుదల చేశారు. ‘మధురానగరిలో యమునా తటిలో .. మురళీ స్వరములే మురిసిన ఎదలో’ అంటూ ఈ పాట సాగుతోంది. కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీనిధి, నయన నాయర్, కాలభైరవ ఆలపించారు. చంద్రబోస్ చేసిన పద ప్రయోగాలు ఆకట్టుకుంటున్నాయి. ఫొటోగ్రఫీ, కొరియోగ్రఫీ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆర్కే అసోసియేషన్, ఆర్కా మీడియా నిర్మించిన ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు.