హైదరాబాద్ : పవన్ కల్యాణ్ హీరోగా ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ త్వరలో పునఃప్రారంభం కానుంది. ‘భీమ్లా నాయక్’ షూటింగ్ పూర్తవగానే ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ ప్రారంభిం చడానికి ప్రణాళిక సిద్థం చేస్తున్నారు. దీనికి సంబంధించి చర్చలు హీరో పవన్కల్యాణ్, దర్శకుడు క్రిష్, చిత్ర సమర్పకుడు ఎ.ఎం.రత్నం భేటీ అయ్యారు. ‘సన్నివేశాలు, షూటింగ్ ప్రదేశాలు, నిర్మించాల్సిన భారీ సెట్లు వంటి విషయాల గురించి చిత్ర నిర్మాత, దర్శకులు మధ్య సమాలోచనలు జరిగాయి. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని నిరవధికంగా షూటింగ్ జరిపి పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ఎ.దయాకర్ రావు తెలియచేశారు. పవన్కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 29న సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడిరచారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్షాహీల శకం నేప థ్యంలో జరిగే కథ కావడంతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్గా ‘హరిహర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు క్రిష్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది.