హైదరాబాద్: మెజిషియన్ నుంచి జబర్దస్థ్లో కంటెస్టెంట్గా ప్రయాణం మొదలు పెట్టిన సుధీర్ అనతికాలంలోనే తన కామెడీ టైమింగ్తో లీడర్గా మారి సుడిగాలి సుధీర్గా బుల్లితెర ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక సినిమాల్లో అడపా దడపా క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న సుధీర్ హీరోగా మారి హిట్ సినిమాలు చేస్తున్నాడు. త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు వంటి సినిమాల్లో హీరోగా చేసిన అవి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేక పోయాయి. అయితే గతేడాది ఆయన నటించిన గాలోడు రిలీజై బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దాంతో హీరోగా సుధీర్కు ప్రేక్షకుల ఆమోదం దొరికింది. నిర్మాతలు కూడా డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా తాజాగా సుధీర్కు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి బ్లాక్బస్టర్ సినిమాలు తెరకెక్కించిన దశరథ్తో సుధీర్ చేతులు కలపనున్నట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని తెలిసింది. ఇక దశరథ్ కొంత కాలంగా లైమ్ లైట్లో లేడు. ఏడేళ్ల క్రితం వచ్చిన శౌర్య మూవీ దశరథ్కు చివరి సినిమా. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది.
అంతేకాకుండా ఈ సినిమా సుధీర్ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతుందట. ఇక సుధీర్కు జోడీగా పూజిత పొన్నాడ హీరోయిన్గా నటించనుందని సమాచారం.