హైదరాబాద్ : అల్లు అర్జున్, రష్మికమందన్న జంటగా నటిస్తున్న ‘పుష్ప’ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరింది. కాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ పేరుతో విడుదలైన ‘దాక్కో .. దాక్కో మేక’ అనే పాట, రికార్డుస్థాయిలో వ్యూస్ను, లైక్స్ను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక సెకండ్ సింగిల్ ను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ, రష్మిక పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి అనే గిరిజన అమ్మాయి పాత్రలో కనిపించనుంది. సెకండ్ సింగిల్గా .. రష్మికపై చిత్రీకరించిన పాట ఉండనుందనే విషయం అర్థమవుతోంది. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు.