Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘నా పాత్రకు రూ.5 లక్షలు ఎక్కువట!’

హైదరాబాద్‌: పారితోషికం విషయంలో దర్శకధీరుడు రాజమౌళి తనని అవమానించారని ఒకప్పటి అందాల నటి కాంచన అన్నారు. ‘సువర్ణ సుందరి’ మొదలుకొని సౌత్‌తోపాటు హిందీలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన కథానాయిక ఆమె. 1986 తర్వాత సినిమాలకు దూరమైన ఆమె ‘అర్జున్‌రెడ్డి’లో విజయ్‌ దేవరకొండకు బామ్మగా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె రాజమౌళిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తనని అవమానించారని ఆరోపించారు. ‘బాహుబలి’ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆమె ప్రస్తావిస్తూ… ‘‘బాహుబలి సినిమా కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. రెండు రోజులు షూటింగ్‌కి నా డేట్స్‌ అడిగారు. నేను రూ.5 లక్షలు రెమ్యునరేషన్‌ అడిగాను. అంత ఇవ్వడానికి ఆయన చాలా ఆలోచించారు. నా పాత్రకు అది ఎక్కువ అన్నారు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పి నన్ను వద్దనుకున్నారు. అది నాకు పెద్ద అవమానంగా అనిపించింది. రాజమౌళిలాంటి స్టార్‌ డైరెక్టర్‌కు అది పెద్ద అమౌంట్‌ కాదు. నాకు ఆ డబ్బు పెద్ద విషయమే కాదు. కానీ, నాలాంటి వారికి ఇస్తే అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. నేను సేవలకే ఉపయోగిస్తాను. అదే ముసలి హీరోలకు మాత్రం భారీ మొత్తంలో ఇస్తారా? నేను ఎవర్నీ విమర్శించడం లేదు. నాలాంటి ఆర్టిస్టుల కష్టాలను ఉద్దేశించి ఈ కామెంట్స్‌ చేస్తున్నా. నేటితరం మేకర్స్‌కు ఆర్టిస్ట్‌ల కష్టాల గురించి తెలీదు’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img