హైదరాబాద్ : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అభిమా నులతో పాటు సినీ ప్రేమికులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ ‘రాధే శ్యామ్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్తో చిత్ర బృందం సర్ప్రైజ్ చేసింది. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా రూపొందుతోన్న ‘రాధే శ్యామ్’ భారీ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్, టీజర్లు ప్రేక్షకులను విశే షంగా ఆకట్టుకున్నాయి. తాజాగా సోమవారం కృష్ణా ష్టమి సందర్భంగా, చిత్రబృందం ఓ సర్ప్రైజింగ్ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో విక్రమా దిత్య-ప్రేరణలుగా నటిస్తున్న ప్రభాస్-పూజా హెగ్డే లుక్స్ ఆకట్టుకుంటు న్నాయి. కాగా ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు, టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.