హైదరాబాద్ : మహేష్, వెంకటేశ్లను పెట్టి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే క్లాసీ మల్టీస్టారర్ తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎట్టకేలకు కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. ద్వారక క్రియేషన్స్ పతాకంలో ఓ సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్తను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ను జూన్ 2న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే హీరో గురించి వెల్లడిరచ లేదు. కాగా ఈ సినిమాతో మిర్యాల రవిందర్ రెడ్డి మేనల్లుడు హీరోగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 1980 బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ఆ టైమ్లో కోనసీమలో రాజకీయాలు, అక్కడ వర్గ పోరాటాలు, కులాల ఆదిపత్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని, కాస్త రా కంటెంట్తోనే శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు వినికిడి. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.