Friday, April 26, 2024
Friday, April 26, 2024

సెకండ్ వేవ్ లో సలార్ స్టోరీ మారిందా?

కేజీఎఫ్ సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్స్అం మరియు ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 ను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అదే సమయంలో ప్రభాస్ తో సలార్ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే సలార్ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా దాదాపుగా మూడు నెలల పాటు షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. అతి త్వరలోనే తదుపరి షెడ్యూల్ ను మొదలు పెట్టేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సలార్ సినిమా కథలో కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ సమయంలో మార్పులు చేర్పులు చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమా లో ఒక ప్ల్యాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. మొదట ఆ ఫ్ల్యాష్ బ్యాక్ ఎపిసోడ్ ను సింపుల్ గా అనుకున్నారట. కాని ఇప్పుడు దాన్ని మార్చి ఆ సన్నివేశాల్లో బాలీవుడ్ స్టార్ ను నటింపజేసేయాలని భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటించడం వల్ల సలార్ వెయిట్ మరింతగా పెంచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో మరోసారి చర్చలను జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ పై నమ్మకంతో ప్రభాస్ కథ మార్పుకు ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ సినిమ లో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా ఐటెం సాంగ్ ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో చేయించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేజీఎఫ్ హీరోయిన్ నే సలార్ సినిమా లో ఐటెం సాంగ్ చేయించాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నాడట. ఆమె ప్రశాంత్ నీల్ కు లక్కీ చామ్. అందుకే ఆమెను ఐటెం సాంగ్ కు అయినా సలార్ లో తీసుకుంటే లక్ కలిసి వస్తుందని భావిస్తున్నాడట. సలార్ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభించిన తర్వాత కంటిన్యూస్ గా చిత్రీకరణ నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ తో పాటు గుజరాత్ ఇంకా ప్రముఖ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా సలార్ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img