Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

తోటి దర్శకులకు మణిరత్నం గ్రాండ్‌ పార్టీ

చెన్నై: తమిళ సినీ పరిశ్రమ (కోలీవుడ్‌)లోని అగ్ర దర్శకులకు మరో అగ్ర దర్శకుడు మణిరత్నం గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి శంకర్‌, మురగదాస్‌, గౌతమ్‌ మీనన్‌, లోకేశ్‌ కనగరాజ్‌, కార్తీక్‌ సుబ్బరాజు, లింగుస్వామి తదితర దర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరంతా తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇంత హఠాత్తుగా మణిరత్నం ఎందుకీ పార్టీ ఇచ్చాడన్న విషయంపై పరిశ్రమలో చర్చ జరుగుతోంది. అయితే ఇక ఈ గెట్‌ టు గెదర్‌కు సంబంధించిన వివరాలను దర్శకుడు శంకర్‌ వెల్లడిరచారు. ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఫొటోను షేర్‌ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మణిరత్నంకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభ ఉన్న ఫిల్మ్‌ మేకర్స్‌ను కలవడం, మేకింగ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను మాట్లాడుకోవడం, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ క్షణాలు ఎంతో విలువైనవని తెలిపారు. అంతే కాదు అందరు దర్యకులకు మంచి ఆతిథ్యాన్ని అందించినందుకు మణిరత్నం సతీమణి సుహాసినికి ధన్యవాదాలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది దర్శకులతో మణిరత్నం ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. కరోనా సమయంలోకూడా తమిళ దర్శకులందరికీ జూమ్‌ కాల్‌ చేసి… కాసేపు మాట్లాడారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల పొన్నియన్‌ సెల్వన్‌`2తో మణిరత్నం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేశ్‌ కనగరాజ్‌ లియో చిత్రంతో, శంకర్‌ గేమ్‌చేంజర్‌ మూవీతో బిజీగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img