హైదరాబాద్: దుబాయ్లో జరగనున్న నంది అవార్డుల వేడుకపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్సీసీ) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో దుబాయ్ వేదికగా నంది అవార్డుల ఫంక్షన్ను ప్రకటించారు. అయితే ఇక్కడ నిర్వహించే ఈ కార్యక్రమంతో ఫిల్మ్ ఛాంబర్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది రామకృష్ణగౌడ్ వ్యక్తిగతమని స్పష్టం చేసింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ప్రభుత్వ అనుమతి లేదని వెల్లడిరచింది. దీనిని ఓ ప్రైవేటు సంస్థగా తెలిపింది. ఒక వ్యక్తి ఇలా నంది అవార్డులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ అవార్డుల పేటెంట్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉందని గుర్తు చేసింది. దుబాయ్లో జరగనున్న ఈ అవార్డు వేడుకలపై ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు విచారణ జరపాలని టీఎఫ్సీసీ విజ్ఞప్తి చేసింది.