బెంగళూరు: కరుణడ చక్రవర్తి డా॥ శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఘోస్ట్’. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా ప్యాన్ ఇండి యా లెవల్లో ఈ సినిమా రూపుదిద్దు కుంటోంది. ‘కన్నడ బీర్బల్’ వంటి చిత్రానికి దర్శకత్వం వహించి, తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదిం చుకున్న శ్రీని ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయవేత్త సందేశ్ నాగరాజ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ‘ఘోస్ట్’ టీం రూపొందించిన రెట్రో మోషన్ పోస్టర్తో కొత్తసంవత్సరానికి ఆహ్వానం పలికారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరెక్కుతున్న ఘోస్ట్ రెండో షెడ్యూల్ ఇటీవలే మైసూర్లో పూర్తి చేసుకుంది. ఈ షెడ్యుల్ లో శివరాజ్ కుమార్, జయరామ్, ప్రశాంత్ నారాయణన్ల మీద భారీగా నిర్మించిన ప్రిజన్ ఇంటీరియర్ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరు లో వేసిన మరో భారీ సెట్లో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్లో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలు షూట్ చేస్తారు. ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.