హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవల హైదరాబాద్లో హై-ఆక్టేన్ ఇంటర్వెల్ ఎపిసోడ్ను పూర్తి చేశారు. దానితో 80% షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.మే డే సందర్భంగా చిరంజీవి వింటేజ్ మాస్ లుక్లో కనిపించే మూడు కొత్త పోస్టర్లను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లలో మెగా స్టార్ గ్రే కలర్ యూని ఫాంలో టాక్సీ డ్రైవర్గా కనిపిస్తున్నారు. ఓ పోస్టర్ లో టీ టైమ్ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఛార్మింగ్ స్మైల్ తో యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు మెగాస్టార్.చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, వెన్నెల కిషోర్, ఇతరులతో కూడిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోల్కత్తాలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను చిత్రీకరించేందుకు యూరప్ వెళ్లనున్నారు. మహతి స్వర సాగర్ రాకింగ్ నెంబర్ని స్కోర్ చేశారు. యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ షూట్, భారీ సెట్ సాంగ్ చిత్రీకరిస్తాం. దాంతో జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్, చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది. సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు.