Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

న్యాయ వ్యవస్థ వింత పోకడ

దిల్లీలోని ఒక కోర్టు మూడు నెలలుగా జైలులో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌కు గురువారం బెయిలు మంజూరు చేసింది. కానీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ (ఇ.డి.) ఆయన విడులను అభ్యంతర పెట్టడమే కాకుండా 48 గంటల పాటు విడుదలను ఆపేయాలని అభ్యర్థించింది. అయితే దిల్లీ కోర్టు దానికి అంగీకరించలేదు. ఈ కుంభకోణంలో కేజ్రీవాల్‌ పాత్ర ఉన్నట్టు ఇ.డి. నిదర్శనాలు చూపలేకపోయిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌లో కేజ్రీవాల్‌ పేరేలేదన్న అంశాన్ని దిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నియమ్‌ బిందు ప్రస్తావించారు. ఈ కుంభకోణంలో బొక్కారంటున్న డబ్బును ఎన్నికల్లో వినియోగించారని కూడా ఈడీ రుజువు చేయలేకపోయిందని ఆమె అన్నారు. న్యాయమూర్తి బిందు ఉత్తర్వు ప్రకారం శుక్రవారం సాయంత్రానికి కేజ్రీవాల్‌ విడుదల కావాల్సింది. ఇ.డి. వెంటనే దిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఆయన విడుదలను నిలిపివేయించింది. ఇది మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యల్లో భాగమే. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడంలో కొంతమంది న్యాయమూర్తులు అపారమైన నైపుణ్యం సంపాదించారు. మద్యం కుంభకోణం కేసులో గత మార్చి 31న ఇ.డి. అరెస్టు చేసింది. శుక్రవారం విడుదల అయి ఉంటే సరిగ్గా మూడు నెలలకు విడుదలైనట్టు ఉండేది. మొన్నటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అనువుగా విడుదల చేయాలని కేజ్రీవాల్‌ పెట్టుకున్న పిటిషన్‌ను కింది కోర్టు మొదలుకొని హైకోర్టు దాకా తిరస్కరించాయి. కానీ సుప్రీంకోర్టు కొద్ది రోజుల పాటు ఎన్నికల ప్రచారం కోసం ఆయనను విడుదల చేసింది. కేజ్రీవాల్‌ విడుదలకు ఆదేశించిన దిల్లీ కోర్టు కొన్ని షరతులతో బెయిలు మంజూరు చేసింది. విడుదలైన తరవాత ఆయన ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను మాయం చేయడం లాంటి పనులేవీ చేయకూడదన్నది ఆ షరతుల్లో ప్రధానాంశం. కేజ్రీవాల్‌ విడుదలైతే ఈ కేసులో సాక్ష్యాధారాలను చెరిపేస్తారని ఎన్నికల సమయంలో బెయిలు ఇచ్చిన సుప్రీంకోర్టు భావించలేదు. మరి ఇ.డి.కి, దిల్లీ హైకోర్టుకు మాత్రమే సాక్ష్యాధారాలను మాయం చేస్తారని ఎలా అనిపించిందో తెలియదు. సుప్రీంకోర్టే మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినప్పుడు అది ఇచ్చిన తీర్పులకు విలువ ఉండాలిగదా. అదీ లేదు. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు అనుమతించడమే ఒక వైపరీత్యం. అప్పుడు మాయం చేయని సాక్ష్యాధారాలని ఇప్పుడు బెయిలు మీద విడుదలైతే వాటిని మాయం చేస్తారని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు భావించడానికి న్యాయపరమైన, చట్టపరమైన అంశాలకు మించిన కారణాలేవో ఉండి ఉండాలి. హత్య కేసులు, మానభంగం ఆరోపణలు ఉన్న డేరా సచ్చా బాబా రాం రహీం సింగ్‌కు అనేక సార్లు పెరోల్‌ మంజూరు చేశారు. అలాంటిది మద్యం కేసులో పాత్ర ఉందని ఇ.డి. ఆరోపించడం తప్పితే ఇప్పటిదాకా నమ్మదగిన సాక్ష్యాలు ఏవీ ఇ.డి. బయట పెట్టనే లేదు. కేజ్రీవాల్‌ జైలులో ఉన్న మూడు నెలల కాలంలో ఇ.డి. కొనసాగించిందంటున్న దర్యాప్తులో ఎలాంటి సాక్ష్యాధారాలు పోగేశారో తెలియదు. మద్యం కేసులో కేజ్రీవాల్‌ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఆయన డబ్బు అక్రమ చెలామణి చేశారన్నదే. అదే నిజమైతే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి దాకా సాక్ష్యాధారాలు న్యాయస్థానాల ఎదుటైనా సమర్పించకపోవడం కేవలం ఇ.డి. అసమర్థతకు నిదర్శనం మాత్రమే కాదు. అసలు అరెస్టు వెనకే మోదీ ప్రభుత్వ గూడుపుఠానీ ఉంది. రాజకీయ కక్షతోనే కేజ్రీవాల్‌తో సహా మనీశ్‌ సిసోడియాను అరెస్టు చేశారన్న వాదనలు ఉండనే ఉన్నాయి. సాక్ష్యాధారాలే వెల్లడి కానప్పుడు నిందితులు నిరవధికంగా జైలులో మగ్గడం ఎలాంటి న్యాయమో అంతు పట్టదు. ఇది రాజ్యాంగం పూచీ పడ్డ వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమైందని హైకోర్టుకు కూడా తట్టకపోవడం వెనక ఏదో మతలబు ఉండే ఉంటుంది. కేజ్రీవాల్‌ విడుదలను అడ్డుకున్న ఇ.డి. దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు సుధీర్‌ కుమార్‌ జైన్‌, రవీందర్‌ దుడేజాకు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ పూచీ గురించి తెలియదనుకోలేం. కానీ కొంత మంది న్యాయమూర్తులకు ఏలిన వారి మీద ఉన్న భక్తి ప్రపత్తుల కారణంగా స్వేచ్ఛకు ఆటంకాలు ఏర్పడు తున్నాయి. తాము పిటిషన్‌ దాఖలు చేశామని అది మరో పది పదిహేను నిముషాల్లో విచారణకు వస్తుంది కనక ఆయన విడుదలను నిలిపివేయాలన్న ఇ.డి. వాదనను దిల్లీ హైకోర్టు మారు మాట లేకుండా ఒప్పేసుకుంది. అందుకని ఆయన విడుదలకు కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వును నిలిపివేశారు.
మోదీ హయాంలో న్యాయవ్యవస్థతో సహా సకల వ్యవస్థలు ప్రభుత్వ గుప్పెట్లోకి వెళ్లిపోకపోతే దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఇ.డి. అభ్యర్థనను మన్నించే అవకాశమే ఉండి ఉండేది కాదు. న్యాయ స్థానాలలో విచారణకు వచ్చే కేసుల్లో అధిక శాతం ప్రభుత్వ ఫిర్యాదులకు చెందినవే అయి ఉంటాయి. అలాంటప్పుడు న్యాయ మూర్తులు ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే న్యాయాన్ని, చట్టాన్ని ఖాతరు చేయకుండా గంగలో కలపడమే. మోదీ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తే కొందరు న్యాయమూర్తుల వైఖరే ఈ రాద్ధాంతానికి కారణం. విచిత్రం ఏమిటంటే దిల్లీ కోర్టు ఆదేశం బయటకు రాకముందే, అందులో ఏముందో లోకానికి తెలియకముందే మోదీ ఆదేశాలను శిరసావహించే ఇ.డి. హైకోర్టుకు పరుగెత్తడం, హైకోర్టు ఇ.డి. అభ్యర్థనను మన్నించి బెయిలు రద్దు చేయడం ఒక ప్రహసనంగా మారిపోయింది. దిల్లీకోర్టు జారీ చేసిన ఉత్తర్వును దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు కళ్లతో చూశారో లేదో కూడా తెలియదు. అంటే ఏలిన వారి మనసెరిగి నడచుకోవడానికి ఉన్నత న్యాయస్థానాలలో న్యాయ పీఠాలు అధిష్టించిన వారు అలవాటు పడి పోయారన్న మాట. అధిష్టానం ఆజ్ఞలు పాటించే సంస్కృతి హైకోర్టుల దాకా పాకిపోయింది. అధికారంలో ఉన్న వారి మాటనే పాటించే టట్టయితే రాజ్యాంగం, అందులో పౌరులకున్న హక్కులు, వ్యక్తి స్వేచ్ఛ మొదలైన మాటలన్నీ ఉత్తుత్తివే అయిపోతాయి. ఇది న్యాయవ్యవస్థను పరిహసించడమే. ఇది కేవలం కేజ్రీవాల్‌కు సంబంధించిన అంశం కాదు. న్యాయవ్యవస్థ కుంటి నడక నడవడం అసలు సమస్య. న్యాయవ్యవస్థలో ఉన్న దొంతరలు న్యాయం చేసేవిగా ఉండాలి తప్ప అధికార పీఠంపై ఉన్న వారికి ఊడిగం చేసేవిగా మిగిలిపోకూడదు. కానీ సకల వ్యవస్థల మీద ప్రభుత్వం ఉడుంపట్టు బిగుసుకుపోయి ఉన్న దశలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే సాహసం చేస్తుందను కోవడం భ్రమగానే మిగిలిపోతోంది. మద్యం కుంభకోణం నిజమేనని వాదన కోసం అంగీకరించినా కొన్ని న్యాయస్థానాల నిర్ణయాలు అసలు వ్యవస్థ మీదే నమ్మకం సడలి పోయేలా చేస్తున్నాయి. రాజకీయ పరమైన రాగ ద్వేషాలు కోర్టులను కూడా ఆవహించడం ఆశ్చర్యకరం. మద్యం కుంభకోణంలో నిజానిజాల మాట ఎలా ఉన్నా సాక్షాత్తు ముఖ్యమంత్రులనే అరెస్టు చేయడం, అరెస్టయిన తరవాత కూడా ఆయన మూడు నెలలుగా జైలు నుంచే పరిపాలన కొనసాగించడం, దీనిమీద అత్యున్నత న్యాయస్థానం కూడా కచ్చితమైన వైఖరి అనుసరించకపోవడం విడ్డూరమే. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా పరిస్థితి మరీ ఘోరం. ఆయన పదిహేను నెలలుగా జైలులోనే మగ్గి పోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img