Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

పంచకర్మ చికిత్స అందుబాటులో..

విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): ఉంగుటూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో పంచకర్మ చికిత్స అందుబాటులో ఉందని వైద్యురాలు డాక్టర్ కస్తూరి శిరీష గురువారం తెలిపారు. విజయవాడ నుంచి బదిలీపై శిరీష ఉంగుటూరు ఆయుర్వేద ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో అన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదం ద్వారా చికిత్స అందజేస్తామన్నారు. ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని శిరీష అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img