Monday, May 20, 2024
Monday, May 20, 2024

కోటేశ్వరరావు ప్రచారానికి ముఠా కార్మికుల రూ.లక్ష విరాళం

విశాలాంధ్ర-విజయవాడ: ఇండియా కూటమి బలపర్చిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి.కోటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ ముఠా కార్మికులు లక్ష రూపాయల విరాళాన్ని కమ్యూనిస్టు పార్టీ నేతలకు అందించారు. వన్‌టౌన్‌ లెనిన్‌ భవన్‌లో బుధవారం విరాళం మొత్తాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ ద్వారా అందజేశారు. ఏఐటీయూసీ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, నగర ముఠా కార్మిక సంఘం అధ్యక్షులు వియ్యపు నాగేశ్వరరావు, కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి, కోశాధికారి బైపిల్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img