రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: అత్యంత వివాదాస్పదమైన ఆర్
5 జోన్ వ్యవహారంలో ప్రభుత్వ దూకుడుకు హైకోర్టు బ్రేక్ వేసింది. రాజధాని ప్రాంత పేదలను పట్టించుకోకుండా… ఇతర ప్రాంతాల్లోని పేదలకు రైతులిచ్చిన భూములను ఇళ్లస్థలాలుగా కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈనెల 8వ తేదీ ఆర్`5జోన్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఆర్`5జోన్లో గృహ నిర్మాణాలకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాదులు స్పందిస్తూ పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించడానికి కొంత సమయం కావాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.