పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఢల్లీి అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. తొలుత చండీగఢ్లోని ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడే చికిత్స పొందినప్పటికీ.. కడుపునొప్పి మాత్రం తగ్గలేదు. దీనితో హుటాహుటిన ఢల్లీికి తరలించారు. పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా మాన్ అనారోగ్యానికి గురైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని చెబుతున్నాయి.
కాగా పంజాబ్ గాయకుడు సిద్ధు మూసేవాలాను హత్య చేసిన నిందితులను పోలీసులు బుధవారం ఎన్కౌంటర్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసులను సీం అభినందించారు. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మృతి చెందిన గ్యాంగ్స్టర్లను జగ్రూప్ సింగ్ రూపా, మన్ప్రీత్ సింగ్లుగా గుర్తించారు. వీరి నుండి ఎకె 47, పిస్టోల్ను రికవరీ చేసుకున్నట్టు పోలీసులు వెల్లడిరచారు.