హైకోర్టులో పిటిషనర్ల వాదన ` విచారణ నాలుగు వారాలకు వాయిదా
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రభుత్వ జీవోలను జీవోఐఆర్లో పెట్టకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. రాజ్యాంగపరమైన అంశాలు ఉండటంతో లోత్తైన విచారణ అవసరమని హైకోర్టు పేర్కొంది. జీవోలకు సంబంధించిన తీర్పులను మెమో రూపంలో వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీఈ గెజిట్లో ఐదు శాతం మాత్రమే జీవోలను పెడుతున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది ఉమేశ్చంద్ర కోర్టుకు తెలిపారు. ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసి జీవోలను తీసుకోమనడం సరికాదన్నారు. ఆర్టీఐ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవోల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని న్యాయవాది శ్రీకాంత్ వాదించారు. జీవోలను వివిధ కేటగిరీల్లో విభజించి దేనిని వెబ్సైట్లో ఉంచడం లేదని న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ చెప్పారు. ఆర్టీఐ చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, అసలు జీవోలు పెడితే కదా ప్రభుత్వంలో ఏం జరిగేది తెలిసేదని మరో న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు. అన్ని జీవోలను గెజిట్లో ఉంచుతున్నామని ప్రభుత్వ న్యాయవాది సుమన్ తెలిపారు. రెండువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై లోతుగా విచారించాల్సిన అవసంముందని పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.