4 లక్షలకుపైగా నిరుద్యోగుల పడిగాపులు
. 16 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు
. డిసెంబరులోగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం
. పోస్టులు పెంచాలంటున్న అభ్యర్థులు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారంతో ఏపీటెట్
2024(జులై) సెషన్ పరీక్షలు ముగిశాయి. ప్రస్తుతం టెట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు, అంతకుముందు అర్హత సాధించిన వారంతా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తు న్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకిగాను డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం చేశారు. వెనువెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు ఆశించారు. ఇంతలో టెట్ నోటిఫికే షన్కు వ్యవధి చాలదన్న అభ్యర్థనలు రావడంతో దానిని ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షల ప్రక్రియ పూర్తయింది. టెట్ పరీక్షా ఫలితాలు వచ్చిన వెంటనే నవంబరు/డిసెంబరులో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశముం దని అభ్యర్థులు ఆశిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల రాయలసీమ జిల్లాల పర్యటనలో నవంబర్లో డీఎస్సీ ప్రకటన ఇస్తామని ప్రకటించిన విషయం విదితమే. అన్నీ అనుకూలించి డీఎస్సీ`2024కు నవంబరు/ డిసెంబరులో నోటిఫికేషన్ విడుదలైతే.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత నియామక ప్రక్రియ ఉంటుంది. ఈ ఏడాదిలోగా డీఎస్సీ రాకపోతే..నోటిఫికేషన్ వచ్చే ఏడాదికి వాయిదా పడుతుంది.
ప్రతిష్ఠాత్మకంగా డీఎసీ… ప్రభుత్వం కసరత్తు
సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రతిష్ఠాత్మకంగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ డీఎస్సీలో ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా సమర్థంగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. టెట్, డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండేందుకు ఇప్పటికే అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. డీఎస్సీ ప్రకటనపై ఒక స్పష్టత రావడంతో అభ్యర్థులు టెట్తోపాటు డీఎస్సీ సన్నద్ధతపైనా దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ప్రైవేట్ సంస్థల్లో వేలాది రూపాయలు ఖర్చుచేసి శిక్షణ పొందుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి ప్రైవేట్ ఉద్యోగాల్ని మానేసి శిక్షణపైనే దృష్టి పెట్టారు. డీఎస్సీ పరీక్షల కోసం దాదాపు 4లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 6,100 పోస్టుల తోనే ఎన్నికల సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీజేశారు. న్యాయపర మైన సమస్యలు తలెత్తడం, ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అది నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాత డీఎస్సీని రద్దు చేసింది. వాటితోపాటు అదనంగా పోస్టులను కలిపి 16,347 పోస్టులను వెల్లడిరచింది. ఆరేళ్లుగా డీఎస్సీ ప్రకటన కోసం నాలుగు లక్షలకుపైగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కనీసం 25వేల పోస్టులతోనైనా మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
పాత సిలబస్తోనే…
త్వరలో రాబోయే డీఎస్సీ`2024ను పాత సిలబస్తోనే నిర్వహిస్తారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది. గత నోటిఫికేషన్ ప్రకారంగానే సిలబస్ ఉంటుందని, ఎలాంటి మార్పులు లేవని, పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవాలని పాఠశాల విద్యాశాఖ వెల్లడిరచింది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ తరహాగానే డీఎస్సీ సిలబస్ ఉంటుంది. అన్నీ సవ్యంగా సాగితే టెట్ పరీక్షా ఫలితాలు నవంబరు 2గాని, ఆ తర్వాతగాని వెలువడతాయి. ఆ వెనువెంటనే డీఎస్సీ ప్రకటనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో డీఎస్సీ భర్తీపై ఒక స్పష్టత వస్తుందని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. డీఎస్సీకి కేబినెట్ ఆమోదిస్తే… ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇదే సమయంలో ఇటీవల కాలంలో అన్ని జిల్లాల్లోనూ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ప్రకటించిన పోస్టులను పెంచి..నోటిఫికేషన్ జారీజేయాలని, వయోపరిమితిని జనరల్ అభ్యర్థులకు 47 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వానికి అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.