దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 22,431 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది బుధవారం నాటికంటే 19 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇందులో కేరళలోనే 12 వేల కేసులు ఉన్నాయని తెలిపింది. దేశంలో తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది. గడిచిన 24 గంటల్లో 318 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో 4,49,856 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,44,198కి చేరింది. మహమ్మారి నుంచి కొత్తగా 24,602 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,32,00,258కి చేరింది. .దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. గత 24 గంటల్లో 43,09,525 మందికి వ్యాక్సినేషన్ చేశామని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 92,63,68,608 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడిరచారు.