. ప్రతిపాదనలే పంపని రాష్ట్ర ప్రభుత్వం
. పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పిన కేంద్రం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కర్నూలును న్యాయ రాజధాని చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రచారమంతా బూటకమని స్పష్టమైంది. అమరావతి నుంచి హైకోర్టు తరలింపు ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్రప్రభుత్వం శుక్రవారం పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పింది. లోక్సభలో వైసీపీ ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2014 విభజన చట్టం ప్రకారం అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు ఏర్పాటైందని పేర్కొంది. 2019 జనవరి ఒకటి నుంచి అమరావతిలో ఏపీ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని వెల్లడిరచింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు పూర్తిస్థాయి ప్రతిపాదనేదీ తమ వద్ద పెండిరగ్లో లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి హైకోర్టు అభిప్రాయాలు తెలపాల్సి ఉందని చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని వెల్లడిరచింది. 2014 విభజన చట్టం ప్రకారం అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు ఏర్పాటై పనిచేస్తోందని, 2020లో ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలు తరలించాలనుకుం టున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి అన్నారని, కానీ ఆ మేరకు ప్రతిపాదనలేవీ తమకు అందలేదని స్పష్టం చేసింది. హైకోర్టును సంప్రదించి తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని న్యాయశాఖ మంత్రి తెలిపారు.