దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢల్లీిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84 కాగా, డీజిల్ ధర రూ. 89.97 గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 107.83 వద్ద ఉండగా, డీజిల్ రూ. 97.45 గా నమోదైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.49 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 94.39 వద్ద కొనసాగుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.25 కాగా, డీజిల్ ధర రూ. 95.26 గా నమోదైంది. హైదరాబాద్లో శనివారం లీటర్ పెట్రోల్ పై 31 పైసలు పెరిగి రూ. 105.83 వద్ద కొనసాగుతోంది. డీజిల్ రూ. 97.96 వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో మరో ముఖ్య పట్టణమైన కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71 గా ఉండగా, డీజిల్ రూ. 97.83 గా నమోదైంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.23 కాగా, డీజిల్ రూ. 99.80 గా ఉంది. సాగర నగరం విశాఖలో లీటర్ పెట్రోల్ రూ. 106.80 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 98.43 కు చేరుకుంది.