ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా లోపంపై భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే అంశంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యానికి సంబంధించిన వివరాలను ప్రధాని మోదీ నుంచి అడిగి తెలుసుకున్న రాష్ట్రపతి భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది. జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం అఫైర్స్) అండ్ జస్టిస్ అనురాగ్ వర్మలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది.