సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఏపీ సీఎం ముఖ్యకార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో అప్పటివరకు సీఎంవోలో కీలకంగా వ్యవహరించిన అధికారుల స్థానంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కొందరిపై బదిలీ వేటు పడిరది. సీఎం చంద్రబాబు సీఎంవోను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు, దీనిలో భాగంగానే ముఖ్యకార్యదర్శిగా రవిచంద్ర నియామకం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆయన గతంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. మంచి నిజాయతీగల అధికారిగా గుర్తింపు పొందారు. బడ్జెట్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.