ప్రముఖ నటుడు సోనూసూద్పై పోలీసు కేసు నమోదైంది. తాజాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున తన సోదరి కోసం మోగాలోని లాండెకే గ్రామంలో ప్రచారం చేస్తూ నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అంతే కాకుండా పోలింగ్ బూత్ వద్ద ఉన్న సోనూసూద్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం మోగాలోని పోలింగ్ స్టేషన్లను సందర్శించకుండా సోనూ సూద్ ను నిషేధించింది. దీనిపై స్పందించిన సోనూ.. తన వంతుగా, తాను పోలింగ్ బూత్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా మాత్రమే ప్రయత్నిస్తున్నానని అన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో డబ్బులు పంపిణీ చేయడాన్ని మేం అడ్డుకుంటున్నాం. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడటం తమ కర్తవ్యమని వెల్లడిరచారు. మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ పోటీ చేశారు.