రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. రెపో రేటును మార్చడం లేదని, 4 శాతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. రివర్స్ రెపో రేటు 3.35 శాతమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ఈ సారి కూడా సర్దుబాటు ధోరణినే కొనసాగించనున్నట్లు వెల్లడిరచారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఇది పదో సారి. ఈ రేట్లను చిట్టచివరిసారి 2020 మే 22న మార్చింది. మానెటరీ పాలసీ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మంగళవారం నుంచి సమీక్ష నిర్వహించారు. వీరంతా ఏకగ్రీవంగా ఈ రేట్లను మార్చకూడదని నిర్ణయించారు. వృద్ధికి ఊతమివ్వడం కోసం ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఉండటం కోసం అవసరమైనంత వరకు ఇదే ధోరణిని కొనసాగించాలని నిర్ణయించింది.