Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు

. మూడేళ్లలో 28 లక్షల కుళాయి కనెక్షన్లు
. అన్ని గ్రామాలకు నిరంతర నీటి సరఫరా
. ‘జల్‌జీవన్‌ మిషన్‌’ సమీక్షలో చంద్రబాబు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలి… ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిరంతరాయంగా ఇంటింటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా, జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాలపై గురువారం సీఎం సమీక్ష చేశారు. మొత్తం 26 జిల్లాల్లో 95.44 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్‌ ద్వారా నీటిని అందించాల్సి ఉండగా, ఇందులో 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 39.30 లక్షల కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేయగలిగిందన్నారు. సకాలంలో మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వనందువల్ల కేవలం 5 జిల్లాల్లో మాత్రమే 90 శాతానికి పైగా ట్యాప్‌ కనెక్షన్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షిత నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో పాటు నిధులు తీసుకురావడంలో కూడా ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన రూ.27,248 కోట్లలో వైసీపీ ప్రభుత్వం రూ.4235 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఇంకా 28 లక్షల ఇళ్లకు ట్యాప్‌ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాన్ని ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కేరళతో పాటు వివిధ రాష్ట్రాలు బ్రహ్మాండంగా వినియోగించుకున్నాయని చెప్పారు. 2019కి ముందే అనేక గ్రామాల్లో నిర్మాణమై ఉన్న ట్యాంకర్ల ద్వారా ట్యాప్‌ కనెక్షన్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేశామని…తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. సురక్షిత తాగునీటిని ప్రతి ఇంటికీ నిరంతరం అందించేందుకు సమీపంలోని రిజర్వాయర్ల నుండి గ్రామాలకు పైప్‌ లైన్లు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా అయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. ఇందుకోసం నీటి సామర్థ్యం, వినియోగంపై ఇరిగేషన్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. శాశ్వతంగా 95 లక్షల గృహాలకు నిరంతరం తాగునీరు అందించాలన్నారు. పనులు చేపట్టిన గుత్తేదారులు నిర్ణయించిన కాలానికి మెయింటెనెన్స్‌ చేయడంతో పాటు ఎలాంటి నాణ్యతతో కూడిన మెటీరియల్‌ వాడుతున్నారో తనిఖీలు చేయాలని చెప్పారు. గత ఐదేళ్లలో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి ఉంటే ఈ పాటికే ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరు అందేదన్నారు. మళ్లీ 3 నెలల్లో పనులు పట్టాలెక్కించి పరుగుల పెట్టించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, ఆయా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img