కేరళలో 4 ఎంపీ స్థానాలకు సీపీఐ అభ్యర్థుల ఖరారు
తిరువనంతపురం: రానున్న లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనీరాజా పోటీ చేయనున్నారు. కేరళలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) లో రెండవ అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న సీపీఐ…. రాబోయే లోక్సభ ఎన్నికల్లో నాలుగు కీలక ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వినయ్ విశ్వం తిరువనంతపురంలో మీడియా ప్రతినిధులకు వివరాలు వెల్లడిరచారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న వయనాడ్ నియోజకవర్గం నుంచి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి అనీరాజా అభ్యర్థిత్వం ఖరారు కాగా తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పార్టీ కురువృద్ధుడు, మాజీ ఎంపీ పన్నియన్ రవిచంద్రన్ పోటీ చేయనున్నారు. ఇక మాజీ వ్యవసాయ మంత్రి వీఎస్ సునీల్ కుమార్ త్రిసూర్, పార్టీ యువజన విభాగం ఏఐవైఎఫ్ నాయకుడు సీఏ అరుణ్కుమార్ మావెలిక్కర స్థానాల నుంచి బరిలోకి దిగుతారని వినయ్ విశ్వం వెల్లడిరచారు.