రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపిందని సీఎం చంద్రబాబు చెప్పారు. వర్షాలపై ప్రజల మొబైల్ ఫోన్లకు మెసేజ్ ల్ పంపి అలర్ట్ చేయాలన్నారు. భారీ వర్షాలపై కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్ధతపై సమీక్షించారు. చెరువు కట్టలు, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలని చెప్పారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు. అప్రమత్తతతో ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చేయాలని చెప్పారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని చంద్రబాబు తెలిపారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలన్నారు. అప్రమత్తతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలన్నారు. కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలన్నారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కరుస్తాయని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరులో 30ఎంఎం వర్షపాతం నమోదైందని వివరించిన అధికారులుౌరేపటి నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్దంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.