Friday, October 25, 2024
Friday, October 25, 2024

విజయవాడలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా.. చ‌ర్య‌ల‌కు ఆదేశం

విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఈ విష‌య‌మై మంత్రి.. గుంటూరు కలెక్టర్‌, ఎస్‌పీ, విజయవాడ సీపీతో ఫోన్‌లో మాట్లాడారు. డబ్బు ఆశచూపి, కిడ్నీ కొట్టేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీని ఆదేశించారు. ఇలాంటి ఘటనల‌పై నిఘా పెట్టాల‌ని, పున‌రావృతం కాకుండా చూడాలని కోరారు. బాధితుడు గార్లపాటి మధుబాబు ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాల‌తో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img