జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను అరుదైన ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరిగే సదస్సుకు ఐక్యరాజ్య సమితి ఆహ్వానించింది. ఈ సమావేశంలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న ప్రచారానికి రెండు రోజుల పాటు తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నారు. ఈ నెల 20 న న్యూయార్క్ వెళ్లనున్నారు. అయితే భారతదేశం తరఫున ఈ సమావేశాలకు కేవలం నలుగురికి మాత్రమే ఆహ్వానం ఉంటుంది అందులో పవన్ కల్యాణ్కు చోటు దక్కడం విశేషం.