ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. వినియోగదారులు స్టాక్ పాయింట్ల దగ్గరికి వెళ్లి ఇసుకను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు ఇసుక తవ్వకాలు, సీనరేజ్, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను చెల్లించాల్సి ఉంటుంది.సగటున రోజుకు ఒక వినియోగదారుడు 20 టన్నులే పంపిణీ చేస్తారు. ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న స్టాక్ పాయింట్ల దగ్గర సోమవారం నుంచి ఈ ఉచిత ఇసుక విధానం తొలుత అమలు చేస్తున్నారు. ఈ ఉచిత ఇసుక విధానం పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో మాత్రం అందబాటులో ఉండదు.