ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున బారాబతి సమీపంలో జాతీయ రహదారి-16పై వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. దీంతో అందులో ఉన్న ఏడుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను దవాఖానకు తరలించారు. మినీ ట్రక్కు కోల్కతా నుంచి వస్తున్నదని చెప్పారు. ఘటనా స్థంలోనే ఆరుగురు మరణించగా, మరొకరు దవాఖానకు తీసుకెళ్తుండగా చనిపోయారని వెల్లడించారు. మృతులంతా పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాలకు చెందినవారేనని తెలిపారు. ప్రమాదం ధాటికి మినీ ట్రక్కు ముందుభాగం నుజ్జునుజ్జు అయిందన్నారు. తాజా ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. జాజ్పూర్ పోలీసు సూపరింటెండెంట్, వైద్యుల బృందం, ఇతర జిల్లా పరిపాలన అధికారులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.