Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

కుప్పకూలిన విమానం.. 62 మంది దుర్మరణం

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది దుర్మరణం చెందారు. విమానంలో 58 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నారని.. అంతా మరణించారని అధికారులు వెల్లడించారు. సావో పువాలో లోని విన్ హెడోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. పరానాలోని కాస్కావెల్ నుంచి సావో పాలో గౌరుల్హోన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ఘటన చోటుకుంది.నివాస ప్రాంతంలో విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది. అయితే విమానం నివాసిత ప్రాంతంలో పడిన స్థానికులు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అక్కడ ఒక నివాస ప్రాంతం మాత్రం దెబ్బతినిందని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది, అధికారులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను ఆర్పేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ప్రమాద ఘటనపై అధ్యక్షుడు లుయూజ్‌ లులా డిసిల్వా విచారం వ్యక్తం చేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img