వైసీపీ అధికారంలోకి వచ్చాక సంస్థకు ఇబ్బందులు
మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో వెనక్కి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. గత ఐదేళ్లుగా అమరావతి పేరే వినిపించకుండా పోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిపై ప్రత్యేక దృష్టిసారించారు. రాజధాని ప్రాంతంలో ఏపుగా పెరిగిన ముళ్ల చెట్లను తొలగించి, రోడ్లను క్లియర్ చేసి, ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించారు. అదే సమయంలో అమరావతిలో పెట్టుబడులకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ క్రమంలో అమరావతికి శుభారంభం పలుకుతూ ఎక్స్ఎల్ఆర్ఐ (జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్) అనే సంస్థ పెట్టుబడులకు ముందుకొచ్చింది. మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్లో దేశంలోనే ఈ సంస్థకు మంచి పేరుంది. అహ్మదాబాద్ ఐఐఎం తర్వాతి స్థానం ఈ సంస్థదే. మేనేజ్మెంట్ కోర్సుల్లో తరగతుల నిర్వహణ, శిక్షణలో ఎక్స్ఎల్ఆర్ఐకి మంచి పేరుంది.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థకు 50 ఎకరాలు కేటాయించిన సీఆర్డీఏ భూమిని కూడా రిజిస్టర్ చేసింది. అయితే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులకు అడ్డుపడడంతో ఎక్స్ఎల్ఆర్ఐ పనులు నిలిపివేసి వెనక్కి వెళ్లిపోయింది.