స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: అనర్హత పిటిషన్లపై స్పీకర్ వద్ద విచారణకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు సోమవారం కూడా హాజరుకాలేదు. గతంలో ఒకసారి గైర్హాజరైన ఎమ్మెల్యేలను ఈనెల 12వ తేదీ ఉదయం విచారణకు హాజరుకావాలంటూ మరలా స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. వివిధ కారణాల దృష్ట్యా తాము విచారణకు హాజరు కాలేకపోతున్నామని స్పీకర్ తమ్మినేని సీతారామ్కి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. తాము అనారోగ్య కారణాల దృష్ట్యా హాజరు కాలేక పోతున్నట్టు ఒకరిద్దరు లేఖలు రాశారు. తమకు కొంత సమయం కావాలని కోరారు. రాజ్య సభ ఎన్నికల నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అంశం తెరపైకి వచ్చిన విషయం తెలి సిందే. విచారణకు వరుసగా గైర్హాజరు అవుతున్నం దున స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.