Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

డ్రగ్స్‌పై దృష్టి మళ్లించేందుకే ఆర్యన్‌ అరెస్టు

బీజేపీకి వ్యతిరేకమైనందునే షారుక్‌ కుటుంబానికి వేధింపులు
అమిత్‌షా కనుసన్నల్లో ఏపీ ప్రభుత్వం
సీపీఐ కార్యదర్శి నారాయణ విమర్శ

విశాలాంధ్ర`హైదరాబాద్‌ : ముంద్రా పోర్టు డ్రగ్స్‌ కేసు నుంచి అదానీని రక్షించి, ఆ వ్యవహారం నుంచి దృష్టి మళ్ల్లించేందుకే ఆర్యన్‌ను అరెస్ట్‌ చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. హైదరాబాద్‌లోని మక్దూం భవన్‌లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీి సయ్యద్‌ అజీజ్‌ పాషాలతో కలిసి బుధవారం నారాయణ విలేకరులతో మాట్లాడారు. సినీ హిరో షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేసి, చిత్ర హింసలకు పెడుతున్నారన్నారు. ఆ కుటుంబం అంతా బీజేపీకి వ్యతిరేకమని, అందుకే ఈ విధంగా వేధిస్తున్నారని చెప్పారు. అఫ్గన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా గుజరాత్‌ లోని ముంద్రా పోర్టుకు డ్రగ్స్‌ వచ్చిందన్నారు. ముంద్రాపోర్టు ప్రధాన మంత్రి దత్తపుత్రుడు ఆదానీదని అన్నారు. ఆ పోర్టులో ఏమి జరిగినా పట్టుకోవడానికి వీల్లేదన్నారు. అదానీ కుటుంబానికి రోజుకు వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని, సక్రమంగా సంపాదిస్తే వెయ్యి కోట్లు వస్తాయా అని ప్రశ్నించారు. హెరాయిన్‌ ద్వారానే రోజుకు వెయ్యి కోట్లు వస్తాయని చెప్పారు. ముంద్రా పోర్డుకు వచ్చిన డ్రగ్స్‌ తాలూకు కార్యాలయం అడ్రస్‌ విజయవాడలో ఉన్నదని, అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఉందన్నారు. వైసీపీి ప్రభుత్వం అమిత్‌ షా కనుసన్నల్లో నడుస్తోందన్నారు. విజయవాడలో హెడ్‌ ఆఫీస్‌ పెట్టుకున్నారని, అక్కడి నుంచి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు హెరాయిన్‌ సరఫరా చేస్తున్నారని విమర్శించారు. హెరాయిన్‌ దొరికిన తరువాత ప్రపంచమంతా ఆదానీ ముద్దయిగా మారుమొగుతున్న సమయంలో ఆర్యన్‌ను పట్టుకున్నారని తెలిపారు. హీరో కొడుకు గనుక దీన్ని అడ్డం పెట్టుకొని, ఆదానీ వ్యవహారాన్ని మరుగుపరుస్తున్నారని నారాయణ విమర్శించారు.
పెగాసెస్‌పై సుప్రీం కోర్టు కమిటీ వేయడం ప్రజాస్వామ్య విజయం
పెగాసెస్‌పై సుప్రీం కోర్టు ప్రత్యేకంగా జస్టిస్‌ రవీంద్రన్‌ నాయకత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన టెక్నికల్‌ కమిటీ ఏర్పాటు చేయడం ప్రజాస్వామిక విజయమని నారాయణ పేర్కొన్నారు. పెగాసెస్‌ ఇజ్రాయిల్‌ సాంకేతిక పరిజ్ఞానం గూఢచార వ్యవస్థను నడిపిందన్నారు. ఈ సంస్థ భారతదేశానికి, ప్రపంచానికి, మానవ జాతికి వ్యతిరేకమైందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన సాగుతోందన్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇళ్లపై, పార్టీ కార్యాలయాలపై దాడులు జరపడాన్ని నారాయణ ఖండిరచారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, నూతన సాగు చట్టాలపై స్టే ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. వ్యవసాయం రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించి వేస్తోందని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img