కాబూల్: అఫ్గాన్లో తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టాక దేశంలోని అన్ని వ్యవస్థలపై పట్టు సాధిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యారంగంలో భారీ మార్పులు చేపట్టారు. విద్యామంత్రి హక్కానీ కీలక ప్రకటన ఆప్ఘన్ లోని తాలిబన్ల విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బకీ హక్కానీ దేశంలో విద్యారంగం గురించి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇందులో తాలిబనేతర ప్రభుత్వాల హయాంలో చదివిన చదువులకు కానీ, వాటి ద్వారా పొందిన డిగ్రీలు కానీ చెల్లుబాటు కావని స్పష్టం చేశారు. తాలిబనేతర పాలనలో సాగిన ఆధునిక విద్య కంటే తాలిబన్ల పాలనలో అమలవుతున్న మదరసా విద్యే గొప్పదని కూడా ఆయన వెల్లడిరచారు. దేశంలో షరియా చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించిన తాలిబన్లు ఆధునిక విద్య చదివిన వారిని టార్గెట్ చేశారు. 2000 నుండి 2020 మధ్య కాలంలో ఆధునిక విద్య అభ్యసించిన వారి డిగ్రీలు చెల్లవని తాలిబన్లు ప్రకటించారు. షరియా చట్టం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆధునిక విద్యపై నమ్మకంలేని తాలిబన్లు దేశవ్యాప్తంగా వీటిపై నమ్మకం ఉన్నవారిని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వాల పాలనలో చదువుకున్న చదువులు చెల్లుబాటు కావని తేల్చిచెపుతునాÊ్నరు. ఆఫ్గాన్లో ఉద్యోగాలు చేయాలన్నా అధికార పదవులు ఉండాలన్నా తిరిగి షరియా చట్టం ప్రకారం మదరసా విద్య అభ్యసించాల్సిందేనని తాలిబన్లు పట్టుబడుతున్నారు. 2000 నుండి 2020వరకు వివిధ యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో పాశ్చాత్యవిద్య అందుబాటులోకి రావడంతో ఆఫ్గాన్యువత వీటిని అభ్యసించారు. ఈ కాలంలో లక్షలాదిమంది విద్యార్థులు ఈ డిగ్రీలు తీసుకున్నారు. ఇప్పుడు వాటిని అంగీకరించేందుకుతాలిబన్లు ఇష్టపడటంలేదు.