కీవ్: ఉక్రెయిన్ కోర్టు కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని ప్రకటించింది. పార్టీ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఎనిమిదవ అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ జూలై 5వ తేదీన ఉక్రెయిన్ కమ్యూనిస్టుపార్టీని నిషేధించడంపై అడ్మినిస్ట్రేటివ్ కేసు నం.826/9751/14 నమోదుచేసింది. ఉక్రెయిన్ న్యాయమంత్రిత్వశాఖ వాదనలను కోర్టు ఆమోదించింది. దీనితో ఉక్రెయిన్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాలు నిషేధించడమైంది. పార్టీ ఆస్తి, నిధులు, ఇతర ఆస్తులు, ప్రాంతీయ, నగర, జిల్లా సంస్థలు, ప్రాథమిక కేంద్రాలు, నిర్మాణాత్మక సంస్థలు ప్రభుత్వానికి బదిలీ చేయడమైందని ఉక్రిన్ఫార్మ్లో ప్రచురించింది. కీవ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు న్యాయ మంత్రిత్వ శాఖ ఆదేశాలను ధృవీకరించింది. 2019లో, ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలకు పెట్రో సిమోనెంకో అభ్యర్థిత్వాన్ని ఉక్రెయిన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిషేధించింది. జూలై 1 న, మిఖాయిల్, అలెగ్జాండర్ కోనోనోవిచ్ల విచారణ టెలికాన్ఫరెన్స్ ద్వారా కీవ్లోని సోలోమెన్స్కీ జిల్లా కోర్టులో ప్రారంభమైంది. ఇద్దరు సోదరులు, లెనినిస్ట్ కమ్యూనిస్ట్ యూత్ యూనియన్ ఆఫ్ ఉక్రెయిన్ సభ్యులు నిరాధారమైన ఆరోపణపై మార్చి 7న అరెస్టు చేయడమైంది.