విశాలాంధ్ర – గూడూరు : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెడన నియోజకవర్గ శాసనసభ్యులు ఆదేశాలతో కప్పలదొడ్డి గ్రామంలో 183 ఫ్లాట్లు గల వైయస్సార్ జగనన్న కాలనీలో పాత లేఔట్ లో మెరకలు ప్రారంభించడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా మరుగునుపడిన ఈ లేవుటికి మెరుగులు దిద్ది 17 లక్షల రూపాయలు మెరకలు శాంక్షన్ చేసి త్వరలో ఇంటి నిర్మాణాలు ప్రారంభించే దిశగా ప్రయత్నం చేసిన మన శాసనసభ్యులు జోగి.రమేష్ ధన్యవాదాలు తెలుపుతూ సర్పంచ్ యక్కల మాధవి నాగరాజ్, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్, ఎంపీటీసీ తేజవతి మధు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఆదివారం మంచి ముహూర్తం సందర్భంగా లబ్ధిదారులైనటువంటి పేరిశెట్టి విజయలక్ష్మి రజనీకాంత్ దంపతులు శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది.