గుడివాడ : గుడివాడ డివిజన్ వ్యాప్తంగా బుధవారం 23 కరోనా పాజిటివ్ కేసులు అధికారకంగా నమోదైనట్లు ఆర్డిఓ శ్రీనుకుమార్ తెలియజేశారు. గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో శ్రీనుకుమార్ విలేకర్లతో మాట్లాడుతూ గుడివాడ డివిజన్లో 23 పాజిటివ్ కేసుల నమోదు అయినట్లు తెలిపారు. గుడివాడ టౌన్లో 04, పెద్దపారుపూడి 01, పామర్రు 03, గుడివాడ రూరల్ 01, కైకలూరు 05, ముదునేపల్లి 02, కలిదిండి 02, గుడ్లవల్లేరు 04, నందివాడ 01 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.