Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జగన్‌ రాజకీయ భవిష్యత్తు క్లోజ్‌

విశాలాంధ్ర – జగ్గయ్యపేట: ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, అతని అభిమాని శ్రీనివాస్‌ కోడికత్తితో దాడి చేస్తే జగన్‌ రెడ్డికి 0.5సెంటీమీటర్ల గాయమైతే చంద్రబాబు నిందితుడిపై 307 హత్యాయత్నం కేసు పెట్టి చర్యలు తీసుకున్నారని..ఇటీవల చంద్రబాబుపై వైసీపీ గూండాలు రాళ్లదాడి చేస్తే, ఈ దాడిలో చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ గాయపడి, రక్తం కారితే దోషులపై 324 సెక్షన్‌ కింద అతిచిన్న కేసు పెట్టి వక్రబుద్ధిని చూపారని అంగన్‌వాడీ డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. ఆదివారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ జగన్‌ రెడ్డి తన జీవితమంతా నేరాలు చేయడం, నేరాలు చేసిన వారిని కాపాడడమే అన్నట్లు వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు.సొంత బాబాయ్‌ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా గొడ్డళ్లతో నరికి చంపి పొట్టనబెట్టుకున్న దుర్మార్గులకు కూడా కొమ్ముకాసి కాపాడుతున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు అని అన్నారు.ఏపీ పోలీసుల పరువు సుప్రీంకోర్టు సాక్షిగా మంటగలిసిందని,నిష్పాక్షికంగా కేసు విచారణ చేసే సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టిన ఘనత ఏపీ పోలీసులకే దక్కిందని ఘాటుగా విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img