విశాలాంధ్ర/వత్సవాయి : తెదేపా మైనార్టీ సోదరులు అడిగిన ప్రశ్నలకు నియోజకవర్గ వై యెస్ ఆర్ సి పి మైనార్టీ అధ్యక్షుడు షేక్ రన్ హుస్సేన్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మొదటి ప్రశ్నకి సమాధానం మైనార్టీ కార్పొరేషన్ విషయానికి వస్తే కార్పొరేషన్ లోన్ ఒక కుటుంబానికి మాత్రమే పరిమితము అలాకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమ పథకాలు అమలు చేయడం వలన కుల మత రాజకీయాలుకు అతీతముగా అన్ని కులాలలోని ఒక్క కుటుంబానికి పరిమితము కాకుండా అన్ని కుటుంబాలకు సంవత్సరానికి సుమారు 2లక్షలు రూపాయల లబ్ది చేకూరుస్తున్నారు 2 మసిదుల మరమ్మతులు కావాలని ఎంతమంది అడిగారు ఏమిచేయలేదో మీకు తెలుసా? జగ్గయ్యపేట కి గౌరవ శాసన సభ్యులు వారిని ఎవరు కోరారు 3 షాదిఖానా కి గౌరవ శాసన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం విప్ శ్రీ సామినేని ఉదయ భాను ద్వారా 80 లక్షలు జగ్గయ్యపేట కి నిధులు మంజూరు అయినవి కనీసము ఈ విషయం అయినా మీకు తెలుసా 4 వ విషయము విదేశీ విద్యావిధానం ఎంతమంది ముస్లిం సోదరులు వీసామీద విదేసివిద్య కోసము బయటకి వెళ్లారు ఎంతమంది ముస్లిం సోదరులు విదేసివిద్యా డబ్బులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారో కనీసం ఆధారాలు మీదగ్గర ఉన్నాయ? 5 రంజాన్ తోఫా కులాల వారిగా బీభజించి సంక్రాంతి క్రిస్టమస్ రంజాన్ అని కులరాజకీయాలు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చేయరు అని మీరు గమనించాలి .అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కుల రాజకీయాలుకు అతీతముగా ప్రజా సంక్షేమ పథకాల ద్వారా అందరికి న్యాయము జరుగుతుంది ఇక్కడ మీరు మీ పార్టీ నాయకుల మెప్పు కోసం రెచ్చగొట్టి పనికిమాలిన రాజకీయాలు చేస్తే వినే మైనారిటీ సోదరులు ఎవ్వరు లేరు అని మీరు గుర్తించి ఇకనైనా చిల్లర రాజకీయాలు మని వేయాలనిహితవు పలికారు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రన్ హుస్సేన్.