విశాలాంధ్ర- మైలవరం : స్థానిక లకి రెడ్డి బలిరెడీ ఇంజనీరింగ్ కళాశాలలో ఐ సి సి మరియు సహేలి గర్ల్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థునులకు 15 రోజులు ప్రత్యేక యోగా శిక్షణా తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.అప్పారావు మాట్లాడుతూ యోగా తోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని, యోగా ధ్యానం శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.జె.డి.వి.ప్రసాద్ యోగా మాస్టర్ విద్యార్థునులకు ఉపయోగపడే ఆసనాలను వాటి ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో 31 మంది విద్యార్దునులకు సర్టిఫికెట్స్ ను అందచేశారు.ఈ కార్యక్రమంలో ఐ సి సి ఇంచార్జి ప్రిసైడిరగ్ ఆఫీసర్ డా. పి .శోభారాణి , శ్రీమతి .కె.రాణి రుద్రమ , సహేలి మెంటర్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ మరియు సహేలి కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.