Friday, April 26, 2024
Friday, April 26, 2024

వత్సవాయి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా గంగిపోగు శిరీష

విశాలాంధ్ర..వత్సవాయి : వత్సవాయి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా గంగిపోగు శిరీష ప్రమాణస్వీకారం చేశారు. వత్సవాయిలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఏపీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆమె ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతాయుతంగా సమాఖ్య అధ్యక్షురాలిని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.. అదేవిధంగా మహిళలకు పూర్తిస్థాయిలో స్వయం సహాయక శక్తిగా డ్వాక్రా మహిళలను ప్రోత్సహిస్తామని ప్రభుత్వ సంక్షేమ ఫలాలను మరియు అవకతవకలన్నిటిని సరిచేసి సన్మార్గంలో పెడతానని, ప్రతి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి మహిళా అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడతానని ఆమె అన్నారు .ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది, మైసీపీ ప్రముఖ నాయకులు గాదెల రామారావు మరియు గుత్తా శంకర్రావు జిల్లా నాయకులు మాదాల వీరయ్య చౌదరి జెడ్పీటీసీ దేవమణి శ్రీనివాస్‌ వేమిరెడ్డి వెంకట నారాయణ రెడ్డి యువ సర్పంచ్‌ కొట్టే నగేష్‌ తదితర పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img